కృష్ణా: నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్ పనులకు జడ్పీ నిధులు రూ.31 లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం అవనిగడ్డలో మీడియాతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. వేకనూరులో 60 వేల లీటర్ల సంప్ నిర్మాణానికి రూ.12.50 లక్షలు, జయపురంలో మైక్రో మూలపాలెంలో 20 వేల లీటర్ల సంప్ నిర్మాణానికి రూ.ఆరు లక్షలు మంజూరు అయినట్లు వివరించారు.