PLD: అమరావతిలోని శ్రీఅమరేశ్వరస్వామి దేవాలయంలో శనివారం హుండీలు లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి రేఖ ఒక ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నతాధికారులు సమక్షంలో ఆలయంలో ఉన్న హుండీలు లెక్కింపు కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తామని మీడియా మిత్రులకు సమాచారాన్ని తెలిపారు.