PLD: పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కారం కల్పించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులో పరిష్కారం కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.