ASR: రెవెన్యూ సదస్సులో స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని పాడేరు తహసీల్దార్ వీ.త్రినాధరావు అన్నారు. డీ.గొందూరు, కాడేలి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. భూ సమస్యలు, భూ సరిహద్దుల సమస్యలు, భూ ఆక్రమణలు, మ్యూటేషన్ల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.