PPM: గరుగుబిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 26వ తేదీన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.పైడితల్లి ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఎంపీపీ ఉరిటి రామారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సర్పంచ్లు, ఎంపీటీసీలంతా హాజరవుతున్నారని, మండల స్థాయి అధికారులు పూర్తి అభివృద్ధి నివేదికలతో హాజరుకావాలని కోరారు.