KRNL: నగర ప్రజల భాగస్వామ్యంతో కర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని నగర మేయర్ B.Y రామయ్య అన్నారు. ఈ నెల 2న అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ సర్వసభ్య సమావేశాన్ని తిరిగి సోమవారం నిర్వహించారు. మొత్తం 15 తీర్మానాలను ఆమోదించారు. రూ.4.06 కోట్ల విలువ గల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అదేవిధంగా నగరంలో రహదారులు, డ్రైనేజీ వంటి పలు తీర్మానాలను ఆమోదించారు.