KKD: ఆన్ లైన్ మోసాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోటనందూరు ఎస్సై రామక్రిష్ణ హెచ్చరించారు. సోమవారం కే.ఏ. మల్లవరంలో డ్వాక్రా మహిళలకు ఆన్ లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. చిట్టీలు, వ్యక్తిగత అప్పులు, అధిక వడ్డీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోకూడదన్నారు.