కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 25న 860 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అశోక లేలాండ్, టీమ్లేస్ సర్వీసెస్, సోలార్ సిస్టం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పని చేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్లు ఉన్న టెన్త్, డిగ్రీ ఆపై విద్యార్హతలు ఉన్నవారిని అర్హులుగా ప్రకటించారు.