ప్రకాశం: దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో శనివారం శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.