GNTR: 10వ తరగతి విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి పాఠశాలల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి కృషిచేయాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక సూచించారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం సమ్మేటివ్ అసెస్మెంట్ టర్మ్-1 పరీక్షలను స్కూల్ ప్రధానోపాధ్యాయులు యం.డి ఖాసీంతో కలిసి డీఈవో పరిశీలించారు.