ATP: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం తాడిపత్రి రానున్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాల అమలును పరిశీలించనున్నారు. ముందుగా జమ్మలమడుగు బస్టాండును సందర్శించి తరువాత తాడిపత్రి బస్టాండుకు చేరుకుంటారు. ప్రయాణికులతో మాట్లాడి సంస్థ అందించే సౌకర్యాలపై వివరాలు సేకరించనున్నారు.