అన్నమయ్య: కూటమి ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా మదనపల్లెను ప్రకటించాలని జేఏసీ నాయకులు కోరారు. మంగళవారం బైపాస్ రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వారు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష, జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు జిల్లా పేరు అంశాన్ని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.