ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో నేడు వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 70% ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 84% బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన బాలికలను ప్రిన్సిపల్ హసీనా బేగం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. ఉత్తీర్ణులైన బాలికలు భవిష్యత్తులో కూడా ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆమె కోరారు.