KRNL: సహజ వనరులను పొదుపుగా వాడుకుని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని బృందావన్ భారత్ గ్యాస్ నిర్వహకురాలు బుగ్గన కోటేశ్వరి అన్నారు. శుక్రవారం పట్టణంలో భారత్ పెట్రోల్ కార్పొరేషన్ 49వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు బృందావన్ భారత్ గ్యాస్ ఆధ్వర్యంలో సహజ వనరుల పొదుపు, వినియోగం పై అవగాహన సదస్సు, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.