ATP: తాడిపత్రి మండల పరిధిలోని కడప హైవేపై సీఐ శివగంగాధర్ రెడ్డి శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. హుస్సేనాపురం వద్ద ఎస్సై కాటయ్యతో కలిసి నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ప్రతులను పంపిణీ చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని సీఐ సూచించారు.