SS: కొత్తచెరువు మండలం బండ్లపల్లి పంచాయతీలో పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ, గ్రామ అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.