E.G: రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామంలో శ్రీకనక దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. కనకదుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో వైసీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.