KDP: గండికోట ఉత్సవాలను పురస్కరించుకుని కడప నగరంలో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో సాగిన ర్యాలీ నగర వీధుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈనెల 11,12,13 తేదీల్లో జరగనున్న ఉత్సవాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.