దేశంలో గాడిదల సంఖ్య తగ్గుతున్నందున కేంద్ర ప్రభుత్వం గాడిదల పెంపకాన్ని ప్రోత్సహించడానికి కొత్త స్కీమ్ ప్రకటించింది. రూ.50 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. జాతీయ పశుసంపద మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులను పెంచడం, దేశీయ జాతులను పరిరక్షించడమే ఈ పథకం లక్ష్యం. రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక, సహకార సంఘాలు దరఖాస్తు చేసుకోవచ్చు.