SRPT: పార్టీ పటిష్టతకు బూత్ కమిటీలే పునాది అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఓ. శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘బూత్ నిర్మాణ అభియాన్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని 1,205 బూత్ కమిటీలను పకడ్బందీగా పునర్నిర్మించాలని, మోదీ ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేరవేయాలని దిశా నిర్దేశం చేశారు.