NRPT: అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రిప్పర్ను ఊట్కూర్ మండల పోలీసులు పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఊట్కూర్ చెక్ పోస్ట్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ట్రిప్పర్ను తనిఖీ చేశారు. వాహనాన్ని స్టేషన్కు తరలించి, డ్రైవర్ రాజేశ్, యజమాని భీమేష్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమేష్ తెలిపారు.