గుంటూరులో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) రాష్ట్ర 51వ మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహాసభలలో పాల్గొనేందుకు అద్దంకి నుంచి శనివారం యుటీఎఫ్ కార్యకర్తలు ప్రత్యేక వాహనంలో తరలి వెళ్లారు. ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారంలో యుటీఎఫ్ అగ్రగామిగా పోరాడుతుందని యూనియన్ రాష్ట్ర కౌన్సిలర్ జయ బాబురావు అన్నారు.