MBNR: కౌకుంట్ల మండలంలోని పేరూరు సర్పంచ్గా శృతి అరవింద్ రెడ్డి, వెంకంపల్లి సర్పంచ్గా సంప్రీతి రామ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బలపరిచిన వీరిని సోమవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సన్మానించి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల సమస్యలు పరిష్కరించి, అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.