KNR: ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి కాకుండా తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకోవాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. కేశవపట్నంలో పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదని, గెలిచిన రోజు విజయోత్సవాలకు అనుమతి లేదన్నారు. డిసెంబర్ 18 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు.