AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ నిర్వహించాల్సిన గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో టీటీడీ కార్తీక దీపోత్సవం నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు సమర్పించనున్నారు. కార్తీక దీపోత్సవం కారణంగా భక్తుల సౌకర్యార్థం గరుడ సేవ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.