ప్రకాశ: జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని మెరైన్ పోలీసులు సూచించారు. తీరం లోపలికి పోకుండా.. నిర్దిష్ట ప్రదేశంలో స్నానాలను ఆచరించాలని తెలిపారు. అలల ఉధృతి సమయంలో జాగ్రత్తలు పాటించాలని, చిన్నారులను తీరం లోపలికి తీసుకువెళ్లకపోవడమే మంచిదన్నారు. విలువైన వస్తువులను జాగ్రత్తపరచుకోవాలన్నారు.