పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్పై ఆ జట్టు మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తీవ్ర విమర్శలు చేశాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఎక్కువ పరుగులు ఇవ్వడంపై మండిపడ్డాడు. భారత్కు అతడొక రన్మెషీన్లా మారాడంటూ వ్యాఖ్యానించాడు. కాగా, ఆదివారం జరిగిన ఫైనల్లో హారిస్ రవూఫ్.. 3.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు.