AP: చిత్తూరు జిల్లా ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంతమేర అక్రమ మైనింగ్ చేశారో తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. రిటైర్డ్ జడ్జి సుధాంశు ధులియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఈ కమిటీని నియమించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.