KDP: ప్రతి ఒక్కరికి ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలని, అప్పుడే మనం మన చుట్టూ ఉన్నవారిని కాపాడగలుగుతామని జిల్లా రెవెన్యూ అధికారి, రెడ్ క్రాస్ సొసైటీ స్పెషల్ ఆఫీసర్ విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. చింతకొమ్మదిన్నె మండలంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో, ప్రథమ చికిత్సపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.