PLD: నరసరావుపేటలో ఏపీ గిరిజన గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు కృష్ణ దేవరాయులు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. విద్యారంగంలో గిరిజనుల అభివృద్ధికి ఈ పాఠశాల దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ఉత్తమ లక్ష్యాలు చేరుకోవాలని అభినందనలు తెలిపారు.