ELR: చాట్రాయి మండలం జనార్ధనవరంలో రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. 2 కోట్ల రూపాయలతో జనార్ధనవరం నుండి తుమ్మగూడెం వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. కూటమి పాలనతో పల్లెల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.