KDP: బ్రహ్మంగారిమఠంలో ఆదివారం నుంచి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకుఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. వేసవికాలం కావడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ తెలిపారు.