NDL: బనగానపల్లెలోని క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం గ్రీవెన్స్లో భాగంగా ప్రజల నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని.. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. పలువురు అధికారులు, నేతలు, కార్యకర్తలు మంత్రిని కలిశారు.