HYD: హైదరాబాద్లో MMTS విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిటీ పరిధిలో 102.4 కి.మీ. పొడవున ఆరు మార్గాల్లో కొత్త రైల్వేలైన్లు ఏర్పాటు చేయనుంది. అలాగే ఫలక్ నుమా-ఉందానగర్ వంటి ప్రాంతాల్లో డబ్లింగ్ నిర్మాణాలను చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల పార్లమెంట్లో ప్రకటించారు.