ప్రకాశం: వినాయక మండపాలకు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. వినాయక మండపాలకు పర్మిషన్ తీసుకోవాలని, కమిటీ సభ్యులు వారి ఆధార్ కార్డును వివరాలను పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని తెలిపారు.