మహబూబ్ నగర్: కోడేరు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం. కోడేరు గ్రామానికి చెందిన బొమ్మగాల్ల మహేశ్ అనే యువకుడు రాత్రి 11 గంటల ప్రాంతంలో పోచమ్మ టెంపుల్కు దగ్గరలో ఉన్న బావి దగ్గర చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.