విశాఖకు త్వరలో 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు ప్రభుత్వ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహణకు అనువైన ఏర్పాట్లు ఆయా డిపోలో విశాఖ రీజియన్ అధికారులు పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పరిశీలన అనంతరం మొదటి విడతలో 50 బస్సులు, రెండో విడతలో మరో 50 బస్సులు పంపనున్నట్లు తెలిపారు. వచ్చేనెల నుంచి విశాఖకు ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి.