AKP: కోటవురట్ల మండలంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. మంగళవారం సాయంత్రం పీఆర్టీయూ ఉపాధ్యాయ ప్రతినిధులు లింగాపురం, తంగేడు,బీకె పల్లి తదితర గ్రామాల్లో ఉపాధ్యాయ ఓటర్లను కలిసి గాదె శ్రీనివాసులు నాయుడికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉపాధ్యాయుల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ప్రచార కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొన్నారు.