Akp: చోడవరం గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కూటమి నాయకులు ఆ ఫ్యాక్టరీ విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డీ.వెంకన్న మంగళవారం ఆరోపించారు. ఫ్యాక్టరీ వద్ద చెరకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారన్నారు. సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని చెప్పారు.