ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. కాగా సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందున్నారు. అయితే రేపటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన ఉండగా, దాని కంటే ముందే ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.