కృష్ణా: రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలయ్యాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ మేరకు శనివారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రూ.40.22కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.