ATP: జాతీయ ఓటరు దినోత్సవాన్ని శనివారం రొళ్ల తాహశీల్దార్ షేక్షావల్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమములో భాగంగా తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులచే బస్టాండ్ కూడలి వరకు ర్యాలి నిర్వహించి రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాహశీల్దార్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు.