ATP: గుంతకల్లు అంబేడ్కర్ విగ్రహం ఎదుట శనివారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ.. అనంతపురంలో ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి చావుకు కారణమైన కళాశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఫీజులు వసూలు చేసే మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రాణాలు కాపాడడంలో లేదని మండిపడ్డారు.