ప్రకాశం: మర్రిపూడిలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల తహసీల్దార్ జ్వాల నరసింహ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక ర్యాలీని విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారాన్ని చేపట్టారు. విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఓటు యొక్క ప్రాముఖ్యతను తహసీల్దార్ విద్యార్థులకు, ప్రజలకు వివరించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.