ప్రకాశం: ప్రజా సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించేందుకే ‘మన ఊరు- మన ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురం పట్టణం లోని తూర్పువీధిలో శనివారం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలు తెలియజేసిన సమస్యలను అక్కడికక్కడే అధికారులకు తెలిపి వెంటనే పరిష్కరించాలని సూచించారు.