W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో శనివారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సాయిభవాని ఆధ్వర్యంలోని వైద్య బృందం పలువురికి రక్తపోటు, మధుమేహం వంటి పరీక్షలు నిర్వహించి, మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ ఉదయలక్ష్మి, డీఈఓ సాయిరాం వెంకటేష్, ఎం.ఎల్.హెచ్.పి సంఘమిత్ర, ఎంపీహెచ్ఎ వెంకట్రాజు పాల్గొన్నారు.