ELR: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్సీ మాజీ జెడ్పీ ఛైర్మన్ మేక శేషుబాబు బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.