KRNL: కర్నూలు అర్బన్లోని 41వ వార్డు పరిమళ నగర్, 35వ వార్డు కర్నూల్ ఎస్టేట్లో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె వడ్డించి, ఆ తర్వాత భోజనం చేశారు. అనంతరం చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.