KKD: సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వందరోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు.