KKD: కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా శ్రీహరి రాజు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. డిఎస్పీగా సేవలు అందించిన లతా కుమారి విజయవాడకు బదిలీ కావడంతో… రాష్ట్ర ప్రభుత్వం నూతన డిఎస్పీగా శ్రీహరి రాజును నియమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.